స్మరియింతమిపుడే రమ్మా
ఏక తాళం రేవతీ రాగం
రచన: శ్రీ కూచిమంచి సోమ సుందర కవి
సంగీతం: శ్రీమతి సరోజిని శాస్త్రీగారు
స్మరియింతమిపుడే రమ్మా.
ఓ పరమేశ నాకభయ మిమ్మా..ఆ….
మరణ కాలమున మీ .స్మరణ సేయుట నాకు
దొరుకునో దొరకదో…. యెరుగ రాదటే గాన
….స్మరియింత….
వినుతింతు నిదియే గైకొనుమా, నా
మనవి యొక్కటి నీవు వినుమా….
ఘనతర వ్యాధులను గ్రాగునప్పుడు….
మిమ్ము కొనియాడుటకు జిహ్వా కొలుపునో కొలపదో
….స్మరియింత....
సేవింతునిపుడే చేకొమ్మ , ఓ
శివ సుప్ర ప్రసన్నుడవు గమ్మా
దైవ సృతుని భటులు వచ్చి నిలచిన వేళ
శ్రీవెలయ మీ సేవ సేతునో సేయనో
….స్మరియింత..
మతిదలతు నిపుడిందు నిలుమా
సమ్మతి తోడ ప్రత్యక్షమగుమా
మృతి కళ జిత్తా విస్మృతి నొందిప్పుడు
హృద్గతి మీ చింతనమును కలుగునో కలగదో
….స్మరియింత…
సూరినుత నతి సేతునయ్యా, నను
సోమసుందరనేలుమయ్యా
కోరి పల్వెలపురి కొప్పు లింగేశునికి
ఆరూఢింతుద మ్రొక్కుట అబ్బునో అబ్బదో….
స్మరియింతమిపుడే రమ్మా
ఓ పరమేశ నాకభయమిమ్మ.
స్మరియింత మిపుడేరమ్మా
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి