కొండలలో నెలకొన్న
హిందోళ రాగం, ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
కొండలంత వరములు గుప్పెడు వాడు
కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాన్ జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
అచ్చపువేడుకతో అనంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నచ్చిన వాడు
కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించినవాడు
యెంచ యెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ పాలించినవాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి