1 .తెలుసుకోవలసిన విషయములు
- పీటల మీద కూర్చోనునప్పుడు తాంబూలము చేతికి ఇచ్చి కూర్చొపెట్టాలి . ఆ తాంబూలములో రెండు పండ్లు వుండాలి. ముందుగా అక్షింతలు పీటలమీద చల్లాలి.
- హారతి పళ్ళెములో కుంది, వత్తులు,నూనె,తాంబూలము,అక్షింతలు,అగ్గిపెట్టె,కుంకుమభరిణి ఉండవలెను.
- ఆడపిల్లలకు ఏదైనా సందర్భము ఉన్నప్పుడు కాళ్ళకు పసుపు రాయాలి.
- ఏ సందర్భములోనైనా ద్వారము లేనిచో ఒక గొలుసును ఇద్దరు అటుఇటు పట్టుకొని దాని క్రిందనుంచి వెళ్ళవచ్చును.
- ఆడపిల్లలకు ఏదైనా సందర్బమున్నప్పుడు కాళ్ళకు పసుపు రాయాలి.
- హారతి పట్టినపుడు ముందుగా దేవునికి అద్ది తరువాత పెద్దలకైనా,పిల్లలకైనా అద్దవలెను.
- జీవితములో ఒక్కరికి అయిన కన్యాదానము చేయుట మంచిది.
- తాంబులము ఎవరికైనా ఇచ్చునపుడు ఆకునుగాని, పండుగాని తొడిమ మనవైపు ఉండవలెను.
- ఆడపిల్లలకు ఒడిబాలుగా పోసిన బియ్యము పొంగలి చేయాలి. ఇంకా ఎక్కువ ఉన్నయెడల
పులిహార కలుపుకోనవచ్చును.
- ఇంట్లో కడుపుచున్నవారు వున్నయెడల మంచి గుమ్మడికాయ ఆ ఇంట్లో పగులగొట్టరు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి