శివుని శిరసుపైని
రచన: కాకటూరి పద్మావతిగారు
గానం: మొక్కరాల కామేశ్వరిగారు
రాగం: పున్నాగవరాళి, తాళం : తిశ్రగతి,ఏకతాళం
(శివుని పాటలు)
పల్లవి :
శివుని శిరసుపైని చిందులాడేడి గంగా
శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగా
గౌరమ్మా పుట్టింట కాలూ మోపిన గంగా
కవుల ఘంటాముల కులికీనా గంగా
చరణం :
ఉరవళ్ళ పరవళ్ళ ఊసూలాడుకొనుచు
ఏరులలో వాగులలో జారీపోయే గంగా
నురుగులతో ముత్యాల మెరుగులతో కదలూచూ
పరుగులతో భూమిపై ప్రవహించే గంగా
…..శివుని…..
మత్య్సా కచ్చపముల మహరాణివే గంగా
మానవుల పాపములు హరియించే గంగా
మొసలీ వాహనమెక్కి విహరింతువేమ్మా
సస్యముల పోషించే చల్లాని గంగా
…..శివుని….
జాబిల్లితో కలసి ఆటలాడే గంగా
జాలరుల ఇంటాడ పడుచైనా గంగా
జీవాకోటికి ముఖ్య ప్రాణామైనా గంగా
ఔషధులు పోషించే వయ్యారి గంగా
…..శివుని…..
భాగిరథుని ముద్దు పాపాయివే గంగా
సాగరునే మురిపించు చుక్కాని గంగా
నాకమున వసియించు ఆకాశగంగా
నాగలోకమున నివసించు పాతాళాగంగా
…..శివుని….
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి