బృందారక సందోహముతో
రచన: దేవునిపల్లి క్రిష్ణశాస్త్రీగారు
రాగం: మధ్యమావతి, తాళం: ఆది/ఏక
(గోదా దేవి పాట)(కోలాటం, పెళ్ళి పాట)
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
పల్లవి:
బృందారక సందోహముతో….
బృందారక సందోహముతో
వందారు మౌని బృందముతో
పెందిరు వడి పెరుమాళ్ళే
శ్రీ మందిరమును విడి తరలేరే
చరణం:
తులసీవనిలో మొలకయటే
అలహరి కౌగిట చిలుకయటే
వెలసె నెయ్యమున విష్ణుచిత్తులకు
నిలయ దీపమై వెలిగెనటే
విరజానది కావేరియటే
పరమపదము శ్రీ రంగమటే
వరుడా రంగేశ్వరుడు కదా మన
సిరి ఆండాళ్ళే వధువు కదా
…బృందారక సందోహముతో
వందారు మౌని బృందముతో
పెందిరు వడి పెరుమాళ్ళే
శ్రీ మందిరమును విడి తరలేరే
బృందారక సందోహముతో…2
సందోహముతో… సందోహముతో…..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి