19, డిసెంబర్ 2016, సోమవారం

పాన్ గులాబి మిశ్రమం

పాన్ గులాబి మిశ్రమం


కావలసిన పదార్ధములు :
గులాబీ రేకులు...100గ్రాములు
పోక వక్కలు...100 గ్రాములు
ఎండు కర్జూరం….100 గ్రాములు
రోజ్ వాటర్….50 గ్రాములు
చెక్క,లవంగాలు, యాలుకలు ...ఒక్కొక్క స్పూన్ చొప్పున
పంచదార.. పావుకేజి


తయారు చేయు విధానం :ముందుగా వక్కలను,ఎండు కర్జూరంను బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
తరువాత దాల్చిన చెక్క, లంగాలు, యాలుకలును  పౌడర్ చేసుకోవాలి.
మందపాటి పాత్ర తీసుకొని దానిలో గులాబి రేకులు, పౌడర్, వక్కలు, పంచదార, కర్జురాలను మరియు రోజ్ వాటర్ ను కలిపి పొయ్యిమీద పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడేంత వరకు అడుగు అంటకుండా కలబెడుతూ ఉడకనివ్వాలి. అవసరమయితే కొంచెం నీళ్ళు కలపాలు . దగ్గిర పడిన తరువాత దింపేసి చల్లరనివ్వాలి. గాజుసీసాలో భద్ర పరుచుకోవాలి. లేత తమలపాకుకి సున్నం రాసి ఈ మిశ్రమంను ఒక చిన్న స్పూన్ అంత పెట్టి కిళ్ళి లా చుడితే వాణి పాన్ రెడి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి