గోదాదేవి పాశురం-6
రచన : డా. పి యల్. యనత. ప్రసాద్ గారు
సంగీతం : యం . యశోధరగారు
అరభి రాగం
కోవెల పిలిచెను కోమలి కనవే
ప్రకృతి పలికెను పడతి వినవే…...వినవే
గణ గణ లాడెను కోవెల మ్రోగె ఘంటానాదం
అలుపెరుగక మ్రోగే హరి నిలయ శంఖారావం
భక్తుల మొరలవి వినవచ్చే అర్తనాదం
లోకుల కాకుల కేకలు వినలేవా
మత్తుని వదిలి వినవే చెలియా
…..కోవెల పిలిచెను….
పాలిచ్చి చంపెడి పూతన ప్రాణాలు పీల్చెనే
బండి రాక్షసుని చూచి వామ పాదాన తన్నెనే
ఆ యోగ నిద్ర చూడవే నీ మాయ నిద్ర మానవే
లోకాలకిదె సౌభాగ్యం కన్నెలకిదే కళ్యాణ కారకం.
.కోవెల పిలిచెను కోమలి కనవే
ప్రకృతి పలికెను పడతి వినవే…...వినవే
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి